పుంగనూరు ముచ్చట్లు:
దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని, ఆది మన చేతుల్లోనే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. పుంగనూరు అర్భన్ పిహెచ్సి పరిధిలోని కొత్తపేట , మేలుపట్ల, శాంతినగర్ తదితర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది దోమలు కుడితే వ్యాపించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు, కీటకాలు వృద్ధి చెందకుండా ఉండాలంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే మురుగునీరు నిలవలేకుండ చూడాలన్నారు.
Tags; Creating public awareness about mosquito-borne diseases