పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని చదళ్ల గ్రామంలో ఈనెల 20న ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అయూబ్ఖాన్ శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. పీఎం మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటి జబ్బులు కలిగిన రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Tags: Free Eye Camp on the 20th