రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణ పరిధిలోని వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి మహోత్సవాల్లో నేడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు.
నేడు సాయంత్రం 6.30 గంటలకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జయంతి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరభద్రస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల తో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు.
Tags: Minister Mandipalli attends Veerabhadraswamy Jayanthi celebrations today.