పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకాశీవిశ్వేరస్వామి ఆలయంలో వారాహియూత్ సభ్యులు ఆదివారం మట్టితో చేసిన 500 వినాయక ప్రతిమలు విరాళంగా ప్రజలకు ఇచ్చారు. అలాగే పూజా సామాగ్రీకి అవసరమైన వస్తువులు 21 రకాలు ప్రజలకు ఉచితంగా అందించారు. గత నాలుగు సంవత్సరాలుగా యూత్ సభ్యులు ఈశ్వర్, రాహుల్, గోపాల్, పురుషోత్తం , అభివర్షిత్రెడ్డి, ప్రీతమ్, భానుప్రకాష్, పవన్, సాయికార్తీక్, లోకేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tags: Distribution of clay Vinayaka idols