March 27, 2026
Explore
ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

March 27, 2026 | Andhra Pradesh

మొయినాబాద్ ముచ్చట్లు:

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ పొడిగించింది.

నేటితో కస్టడీ ముగియడంతో నిందితులను సిట్ అధికారులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మరో ఐదు రోజులు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు.

కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరుపు లాయర్లు తెలిపారు. ఈ మేరకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. అనంతరం ముగ్గురు నిందితులను జైలుకి తరలించారు.

Tags: Farmhouse Drugs Case: Remand Extended for Three Accused