అమరావతి ముచ్చట్లు:
ఏపీలోని వినాయక చవితి మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల ఛార్జీలను APCPDCL ప్రకటించింది. 500 వాట్లకు రూ.1,000, 1000 వాట్లకు రూ.2,250గా రుసుము నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ వరకు సచివాలయాలు, మీ-సేవా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపింది. అనధికారికంగా విద్యుత్ వాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా మండప నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది.
Tags: Electricity connections for Ganesh pandals in AP: Here are the charges and rules!