September 8, 2026
Explore
పాఠశాలకు ఫర్నిచర్‌ విరాళం

పాఠశాలకు ఫర్నిచర్‌ విరాళం

September 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు అదే పాఠశాలలో బయాలజి టీచర్‌గా పని చేస్తున్న వాణిలక్ష్మీ లు రూ.3 లక్షలు విలువ చేసే ఫర్నిచర్‌ను విరాళంగా అందజేశారు. మంగళవారం ఎంఈవో రెడ్డెన్నశెట్టి సమక్షంలో హెచ్‌ఎం ఉషారాణికి అందజేశారు. ఈ సందర్భంగా వాణీ లక్ష్మీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సౌకర్యార్థం తమ సొంత పొదుపు వెహోత్తం నుంచి పాఠశాలకు ఫర్నిచర్‌ అందించినట్లు ఆమె తెలిపారు. దాత వాణీలక్ష్మీను ఉపాధ్యాయులు సన్మానించి, అభినందించారు.

Tags: Donation of furniture to the school