పుంగనూరుముచ్చట్లు:
శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలో వాల్మీకి మహార్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి సంఘ నాయకులు అద్దాలనాగరాజ ఆధ్వర్యంలో వాల్మీకులు కలసి నవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెసరపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, రెడ్డెప్ప, శ్రీనివాసులు, కృష్ణప్ప, రెడ్డిరాజ, జయరాం, టైలర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Tributes to Maharshi Valmiki