ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్ నియమితులయ్యారు. తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్ స్థానంలో ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీకి చెందిన సిరివెళ్ల ప్రసాద్కు మహారాష్ట్ర, భూపేష్ భగేలకు అస్సాం, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాకు గుజరాత్, సచిన్ పైలట్కు పంజాబ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
Tags: PV Mohan appointed as AP Congress in-charge.