పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నుంచి గండి క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసు నడపడం జరుగుతుందని ఆర్టీసి డిపో మేనేజర్ దినేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ శనివారం సందర్భంగా ఈనెల 5న ఉదయం 5:30 గంటలకు పుంగనూరు నుంచి గండి క్షేత్రానికి చౌడేపల్లె, సోమల, కలికిరి, కలకడ, రాయచోటి , లక్కిరెడ్డిపల్లి మీదుగా ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: Special buses to Gandi Kshetram