మదనపల్లి ముచ్చట్లు:
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.20 ఏళ్లుగా 7 వేల మందికి పైగా కార్మికులు చాలీచాలని వేతనాల తో పనిచేస్తున్నారని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం, ఇంధన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో కార్మికులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Tags: MLA Kishore supports electricity contract workers