September 3, 2026
Explore
బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

బాలిక మిస్సింగ్ కేసు.. గుంటూరు పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

September 3, 2026 | Andhra Pradesh

గుంటూరుముచ్చట్లు:

పోలీసుల తీరు ప్రభుత్వానికే సిగ్గుచేటని వ్యాఖ్య

మూడు నెలలుగా బాలిక ఆచూకీ లేకపోవడంతో తండ్రి పిటిషన్

గురువారంలోగా బాలికను హాజరుపరచాలని డీజీపీకి ఆదేశం

కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags: Missing girl case: High Court expresses severe displeasure with Guntur police.