రైల్వేకోడూరుముచ్చట్లు:
రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
Tags: Distribution of NTR Bharosa pensions in Buduguntapalli