పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసియుండు శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధన మహ్గత్సవాలు రెండవ రోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, వెండి అభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మహామంగళహారతి ఇచ్చి శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
Tags: Sri Raghavendra Swamy Aradhana Celebrations Held Grandly on the Second Day