పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి తైలాభిషేకం, నువ్వులనూనే దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
Tags: Special prayers to Sri Saneswara Swamy