అమరావతి ముచ్చట్లు:
ఏపీలో వైద్యవిద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10శాతం, పీజీ కోర్సుల ఫీజును 15శాతం పెంచింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ.18,150, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ.14.52 లక్షలు, ఎన్నారై కోటా ఫీజు రూ.43.56 లక్షలుగా నిర్ణయించింది. బీడీఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.15,730, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా ఫీజు రూ.14.52 లక్షలకు పెరిగింది.
Tags: Fees for medical courses increased in AP