పుంగనూరుముచ్చట్లు:
ఆస్తి కోసం అన్నదమ్ములు ఇరువురు కొట్టుకుని గాయపడిన సంఘటన గురువారం కృష్ణంరెడ్డిపల్లె రోడ్డులో జరిగింది. పట్టణానికి చెందిన నూర్బాషా(50), ఫైజుల్ల (45)లు వీరితో పాటు హఫీజుల్లా, ఆరీఫుల్లా, అమీరుల్లా లు ఆస్తి వివాదాలపై మాటమాట పెరిగి కొట్టుకున్నారు. గాయపడిన వారు అందరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Conflict between brothers