మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు..మెజిస్ట్రేట్
పల్నాడు ముచ్చట్లు:
చిలకలూరిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ వారిపై కోర్టు కొరడా
మద్యం సేవించి మోటార్సైకిళ్లు నడిపిన ముగ్గురిపై కేసు నమోదు.
చిలకలూరిపేట పట్టణ పోలీసులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు.
సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.
ముగ్గురికి కలిపి మొత్తం రూ.30,000 జరిమానా విధించిన కోర్టు.
డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
ఇప్పటికే జరిమానా చెల్లించిన వారు మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష విధిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచన.
Tags: Chilakaluripet Second Class Magistrate imposes fines on three individuals for drunk driving.