పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ప్యాలెస్ ఆవరణంలో గల శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రెండవ రోజు స్వామివారిని సింహవాహనంపై ఉంచి ఊరేగించారు. మూలవిరాట్ వద్ద హోమాలు నిర్వహించి, అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Sri Someswara Swamy on the Lion Vehicle