సీఎం చంద్రబాబు జోక్యంతో సుఖాంతం..
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు ఎదురైన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సామరస్యంగా పరిష్కారమైంది. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం, తక్షణమే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో యంత్రాంగం వేగంగా స్పందించి సమస్యను సద్దుమణిగేలా చేసింది.
వివరాల్లోకి వెళితే, కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినుల పరస్పర దాడులకు సంబంధించిన ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన వెంటనే స్పందించి, సమస్యను తక్షణం పరిష్కరించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు.
అధికారులు విద్యార్థుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు. వారికి అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాజమాన్యంతో చర్చించి వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించిన తీరు, కల్పించిన భరోసా పట్ల ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల సత్వర చర్యల వల్ల వివాదం మరింత ముదరకుండా సుఖాంతమైంది.
Tags: Controversy involving nursing students in Kakinada…