పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర వైఎస్సార్సిపి రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణలత , ఎంపి మిధున్రెడ్డిలు బుధవారం కేరళలోని శబరిమలై శ్రీ అయ్యప్పను దర్శించుకున్నారు. పెద్దిరెడ్డి 41 రోజుల పాటు కఠోరదీక్షలో ఉంటు శబరిమలై యాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా జరుగుతోంది. యాత్రలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపి రెడ్డెప్ప, వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శులు బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సిపి జిల్లా యూత్ కార్యదర్శి కొత్తపల్లె చెంగారెడ్డి తదితరులు శబరిమలై యాత్రకు వెళ్ళారు. గురువారం ఎమ్మెల్యే, ఎంపి తిరిగి తిరుపతికి రానున్నారు.

Tags: MLA Peddireddy and MP Mithun at Sabarimala