పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఈడిగపల్లెలో నివాసం ఉన్న అర్షున్తాజ్ అనే మహిళ తన భర్త ఖాజావెహోహిద్దిన్ అదనపుకట్నం తేవాలని వేదిస్తున్నట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రమణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈడిగపల్లెకి చెందిన అర్షున్తాజ్కు మదనపల్లెకి చెందిన ఖాజావెహోహిద్దిన్తో 2024 లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఈ మేరకు భర్తతో పాటు అత్త,మామ, మరిది అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేదించేవారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Tags: Dowry case registered