అమరావతిముచ్చట్లు:
భూ యజమాని బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, రూ.4 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కేసులో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (ఏ6), ఆయన భార్య వాణి (ఏ7)లకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: Anticipatory bail for former Speaker Tammineni and his wife.