అమెరికాముచ్చట్లు:
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చంద్రుడి దక్షిణ ధ్రువంలో మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029-32 మధ్య నివాస సదుపాయాలను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో అక్కడ దీర్ఘకాలిక మానవ ఉనికికి పునాది వేయాలని యోచిస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి రోవర్లు, ల్యాండర్లు, డ్రోన్లను దశలవారీగా పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి మంచు ఉండే అవకాశం దీనికి ప్రధాన కారణం. తొలి దశలో రోవర్లు, ల్యాండర్లు, ఇతర రోబోటిక్ వ్యవస్థలు దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశీలిస్తాయి. అనంతరం 2029 నుంచి సెమీ-పర్మినెంట్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నివాస సదుపాయాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.
Tags: NASA takes steps towards a permanent settlement on the Moon!