అమరావతిముచ్చట్లు:
సీనియర్ నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు.
ఏడాదిగా శ్వాసకోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన పలు నంది అవార్డులు దక్కించుకున్నారు.
‘ప్రచండ భారతం’తో వెండితెరకు పరిచయమై, శ్రీరాములయ్య, జయం మనదేరా చిత్రాలకు రచయితగా పనిచేశారు. చందమామ కథలు సినిమాతో మంచి గుర్తింపు పొందారు.
నాంది, విరూపాక్ష సహా పలు సినిమాల్లో నటించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Tags: Senior actor and writer Krishneswara Rao passes away.