చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభ్యర్థనలు, అవసరాలను మంత్రి స్వయంగా విని ప్రతి ఒక్కరి సమస్యకు ప్రాధాన్యత ఇచ్చారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే నిజమైన ప్రజాసేవ అని మంత్రి పేర్కొన్నారు.
Tags: Resolving people’s issues is the goal: Minister’s public grievance meeting.