రాజంపేట ముచ్చట్లు:
రాజంపేటలో దాసరి సామాజికవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి చమర్తి జగన్మోహన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దాసరి వర్గం అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దాసరి వర్గానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం చమర్తి జగన్మోహన్ రాజును ఘనంగా సన్మానించారు.
Tags: The Advancement of BCs is the Development of Society: Chamarthi Jaganmohan Raju