అమరావతిముచ్చట్లు:
రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా YCP తన వ్యూహాన్ని మార్చుకుంది. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై జరిగిన జెన్ జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభావం చూపడంతో, ఏపీలోని యువతను ఆకర్షించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. నీట్ తరహాలోనే డీఎస్సీలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, జెన్ జీ ఉద్యమ స్ఫూర్తితో వైసీపీ తన పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతోంది. ఇటీవల వైఎస్ జగన్ చేసిన ట్వీట్, డీఎస్సీ అక్రమాలపై వైసీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్షల వద్ద జెన్ జీ ప్రస్తావన, పోస్టర్లపై ‘AP GEN – Z War’ అని ముద్రించడం వంటివి వైసీపీ మారిన వ్యూహానికి నిదర్శనాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: Jagan targets 2029… Has YCP changed its strategy?