August 5, 2026
Explore
హైకోర్టు న్యాయమూర్తిని కలసిన న్యాయవాదులు

హైకోర్టు న్యాయమూర్తిని కలసిన న్యాయవాదులు

August 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి , జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి బి.కృష్ణమోహన్‌ను పుంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, బాలాజికుమార్‌ లు మంగళవారం విజయవాడ హైకోర్టులో కలిశారు. పుంగనూరుకు మంజూరైన నూతన కోర్టును కోర్టు ఆవరణంలో ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హైకోర్టు జడ్జి హామి ఇచ్చినట్లు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు తెలిపారు.

Tags: Lawyers met the High Court judge.