పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీ ప్రసన్నపార్వతి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామి దేవాలయంలో అన్నప్రసాదశాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. బుధవారం ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కేంద్రానికి భక్తులు తమకు తోచిన రీతిలో విరాళాలు అందించి, సహకరించాలని కోరారు.
Tags: Please donate to the Annaprasada Hall.