పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని పత్తెమ్మగారిపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీపటాలమ్మ ఆలయంలో మంగళవారం ఆషాడమాస పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఊరేగింపుగా దీపాలు తీసుకుని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చేశారు. వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థనలు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ఆషాడమాస పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పరిసర గ్రామ ప్రజలు పూజల్లో పాల్గొన్నారు.
Tags: Special prayers with lamps for Sri Patalamma