పుంగనూరుముచ్చట్లు:
ఏబివిపి ఆధ్వర్యంలో బుధవారం కళాశాలలు బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిదులు మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం, ఫీజురియంబర్స్మెంట్, యూనివర్శిటి ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేయాలని, ప్రైవేటు ,కార్పోరేట్ విద్యావ్యాపారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి బంద్ చేపట్టినట్లు తెలిపారు. కళాశాలలు స్వచ్చందంగా మూసివేసి బంద్కు సహకరించాలని కోరారు.
Tags:Colleges to remain closed on the 5th.