August 4, 2026
Explore
కరాటేలో 18 పతకాలు సాధించిన విద్యార్థులు

కరాటేలో 18 పతకాలు సాధించిన విద్యార్థులు

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పులినాడు కరాటే అసోషియేషన్‌ విద్యార్థులు 18 మంది పతకాలు సాధించారు. సోమవారం విజయవాడలో జరిగిన 23వ ఎస్‌కెడిఏ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలలో పట్టణానికి చెందిన విద్యార్థులు చరణ్‌, మోహిత్‌, కృతిక్‌, మోక్షగ్నరాయల్‌, జశ్వంత్‌ , విరాజ్‌, లిఖిత్‌, రెడ్డిరోహిత్‌, చేతన్‌సాయి, హర్షవర్ధన్‌, మాస్వామి, పుణిత్‌, దీపక్‌నందన్‌, ప్రజ్వల్‌రెడ్డి, మహేష్‌సాయినాయక్‌, యోగసాయి, నివాస్‌రెడ్డి లు ఉన్నారు. వీరిని అక్టోబర్‌లో విశాఖపట్నంలో జరిగే సౌత్‌జోన్‌ కరాటే పోటీలకు పంపుతున్నట్లు మాస్టర్‌ సదాశివ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఛాంపియన్‌షిప్‌ గ్రహిత మిలటన్‌శా , కోచ్‌ కీ ర్తన్‌ కొండూరు అభినందించారు.

Tags: Students who won 18 medals in karate