రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం ఏకిలపల్లి–చిట్లూరు గ్రామంలో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
Tags: Minister Mandipalli inaugurates CC road works worth ₹70 lakh in Ekilapalli.