- తిరుపతి ముచ్చట్లు:
- ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కేసులు నమోదు,ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో ఈ రోజు తిరుపతి పట్టణంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.
- డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు.
- వాహన తనిఖీలలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మొత్తం 9 కేసులు నమోదు చేసి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరిగింది.
- కోర్టు శిక్షలు.
- గౌరవ 1వ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ధనలక్ష్మి , డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులైన 9 మందికి శిక్ష విధించగా, ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించబడింది.
- అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఒక వ్యక్తికి రూ.500 జరిమానా విధించారు.
- ప్రజలకు సూచనలు.
- మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని, అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని పోలీసులు సూచించారు.
Tags:Traffic Police Take Strict Measures to Curb Road Accidents in Tirupati.