పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఊటూరు గ్రామంలో వెలసియున్న గంగమ్మ తల్లికి ఆదివారం మహిళలు పూజలు చేశారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామస్తులు అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు ఉదయం సాంప్రదాయ దుస్తులు ధరించి, మేళతాళాలతో దీపాలు, చల్లముద్దను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. పలు గ్రామాల ప్రజలు హాజరై అమ్మవారికి పూజలు చేశారు.
Tags: Prayers offered to the village deity for rains.