: వైసీపీ నేతలపై కఠిన చర్యలు తప్పవు – మంత్రి నారా లోకేష్
అమరావతిముచ్చట్లు:
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. మహిళలను అవమానించడం, వారిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమైందని విమర్శించారు. మహిళా పోలీసు అధికారిపై దాష్టీకానికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags;Misbehavior towards a female Sub-Inspector is condemnable.