ఒంటిమిట్ట ముచ్చట్లు:
ఒంటిమిట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో సుజాత అధ్యక్షతన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) 2026–27పై అవగాహన సదస్సు నిర్వహించారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై మండల ట్రైనర్లు చైతన్య, బాలకృష్ణ వివరించారు. నిధులను ఏయే అభివృద్ధి పనులకు వినియోగించవచ్చో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ ముదు కృష్ణారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: Awareness meeting on village development plan in Ontimitta