గద్వాల ముచ్చట్లు:
అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
8వ తరగతి చదువుతున్న కే. తిరుమలేష్ (14) రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది.
కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు.
సమీపంలో వైద్యం అందుబాటులో లేకపోవడమే తిరుమలేష్ మరణానికి కారణమని గ్రామస్తులు అంటున్నారు.
Tags: Tragedy in Venkatapur village