ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలోని అక్షరామ్ వేదికగా మార్చి 26న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఒకే కాలుపై నిలబడి ఉన్న భగవాన్ స్వామినారాయణ్ (నీలకంఠ వర్ణి) 108 అడుగుల విగ్రహాన్ని మహంత్ స్వామి మహారాజ్ ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహం పంచధాతువుతో తయారు చేయబడింది. ఈ చారిత్రక వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 300 మందికి పైగా సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు, వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మార్చి 25న ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
Tags: Installation of the 108-foot Neelkanth Varni statue at Delhi Akshardham.