తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బియ్యాన్ని ఆగస్టు 6న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ వేలంలో మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్ అందుబాటులో ఉంచనున్నారు.
వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు ఆగస్టు 5 సాయంత్రం లోపు Konugolu పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429. అలాగే www.konugolu.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
Tags:TTD Mixed Rice E-auction on August 6