బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట పట్టణంలోని ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలను వ్యవసాయాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, బి.కొత్తకోట ఏవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో పట్టణంలోని రెండు దుకాణాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, సరైన వాతావరణంలో భద్రపరచకపోవడం లాంటి కారణాలతో రూ.2.87 లక్షల విలువైన విత్తనాలను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించరాదని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tags:ADA Shivakumar inspected fertilizer and seed sales outlets.