పుంగనూరుముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం నీట్ లీకేజ్పై బాధ్యత వహించి , కేంద్ర మంత్రి ధరేందప్రదాన్ రాజీనామ చేయాలని పలు సంఘాల నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. గోకుల్ సర్కిల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అయూబ్బాషా, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మున్న లు కలసి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామ చేయాలని, లీకేజ్ కి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆందోళనలో మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tags; Concerns over NEET paper leak