తంబళ్లపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని, కురబలకోట మండలం, పిచ్చల వాండ్ల పల్లె పంచాయతీ, ఎర్రజెండ్లలో రెండు వర్గాల వారు తాగు నీటి కోసం గొడవపడటం తెలిసిందే. వే టు న్యూస్, ఇతర పత్రికల్లో వరుస కథనాలకు అధికార యంత్రాంగం దిగి వచ్చింది. ఎంపీడీవో గంగయ్య ఘటన స్థలాన్ని పరిశీలించి, ఎర్రజేను పల్లికి జియాలజిస్టును మంగళవారం రప్పించారు. బోర్ పాయింట్ ను గుర్తించి కొత్త బోరు ఏర్పాటు చేసి తవ్వేందుకు తక్షణమె చర్యలు తీసుకున్నారు. మారుమూల కుగ్రామ ప్రజల తాగు నీటి సమస్యలు ఇక త్వరలోనే తీరనున్నాయి.
Tags: Geologist Identifies Location for Borewell Installation in Errajendla