పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది కొండలపై చోళుల కాలంలో నిర్మించిన శ్రీ అగస్తీశ్వరస్వామికి ఈనెల 27న మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు జరిగే కుంభాభిషేక కార్యక్రమ పూజలు 29న ముగుస్తుందని అర్చకులు తెలిపారు. గణపతిప్రార్థన, కలశస్థాపన, వరుణజపం, ఏకాదశ రుద్రాభిషేకం , హోమము, కుంకుమార్చన, బిల్వార్చన, కుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Kumbhabhishekam of Sri Agastyeswara Swamy on the 27th