నందలూరు ముచ్చట్లు:
నందలూరులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లి–శిశు ఆరోగ్యం కోసం కాన్పుల మధ్య తగిన విరామం పాటించాలని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కె. శరత్ కమల్ సూచించారు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరానికి ప్రకటించిన థీమ్ ప్రకారం యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలిపారు.
Tags: Awareness rally on the occasion of World Population Day