July 11, 2026
Explore
బోటు బోల్తా ఘటన….భారత ఎంబసీతో మాట్లాడిన లోకేశ్

బోటు బోల్తా ఘటన….భారత ఎంబసీతో మాట్లాడిన లోకేశ్

July 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వియత్నాంలోని బోటు బోల్తా ఘటనలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలన్నారు. తెలుగువారికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దిల్లీలోని ఏపీ భవన్ అధికారులతోనూ లోకేశ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో బాధితులకు సాయం అందించాలని కోరారు.

Tags: Boat capsizing incident… Lokesh spoke to the Indian Embassy.