రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గురువారం కలకలం నెలకొంది. రెండు రోజుల క్రితం అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. దీంతో స్టాంప్ వెండర్లు హుటాహుటిన తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. అయితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగింది. అధికారికంగా ఏసీబీ దాడులపై ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
Tags: Commotion at Rajampet Sub-Registrar Office