అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయసును పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉండగా.. దానిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. 15 రోజుల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పై నిర్ణయం తీసుకోనుంది.
Tags: Retirement age raised for employees of power utilities in AP!!