. తృటిలో తప్పిన పెను ప్రమాదం
పులివెందుల ముచ్చట్లు:
పులివెందుల పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో సోమవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న సమయంలో బస్సు నుంచి రెండు వెనుక టైర్లు ఒక్కసారిగా విడిపోవడంతో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆ సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు అదుపుతప్పకుండా నిలిపివేయగలిగాడు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకుండా పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఈ ఘటనతో స్కూల్ బస్సుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షల ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో తనిఖీలు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Tags: School bus accident in Pulivendula.